హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్‌ కలకలం

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. ఏకంగా అయిదు కోట్ల విలువైన నిషేధిత మత్తు పదార్థం దొరకటం సంచలనం సృష్టిస్తోంది. బొల్లారం ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో తనిఖీలు చేసిన రెవెన్యూ ఇంటెలిజన్స్‌ అధికారులు...  179 కిలోల ఎఫిడ్రిన్‌ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని లీజుకు తీసుకున్న ఓ వ్యక్తి... డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అతను గతంలో డ్రగ్స్‌ తయారీ కేసులో పట్టుబడి బెయిల్‌పై బయటకు వచ్చాడని తెలిపారు. ఫ్యాక్టరీలోని ముడిసరుకు, పరికరాలను సీజ్‌ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top