ఎం3ఎంకు సహారా భూముల విక్రయం | Sahara sells Gurgaon land to M3M India for Rs. 1211 crore | Sakshi
Sakshi News home page

ఎం3ఎంకు సహారా భూముల విక్రయం

Dec 5 2014 1:17 AM | Updated on Sep 27 2018 2:34 PM

ఎం3ఎంకు సహారా భూముల విక్రయం - Sakshi

ఎం3ఎంకు సహారా భూముల విక్రయం

నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్న సహారా గ్రూప్ తాజాగా గుడ్గావ్‌లోని 185 ఎకరాల భూమిని విక్రయించింది.

న్యూఢిల్లీ: నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్న సహారా గ్రూప్ తాజాగా గుడ్గావ్‌లోని 185 ఎకరాల భూమిని విక్రయించింది. గుడ్గావ్ కే చెందిన రియల్టీ సంస్థ ఎం3ఎంకు రూ. 1,211 కోట్లకు ఈ భూమిని విక్ర యించింది. ఈ బాటలో ముంబైలోని వసాయ్, రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లలో గల భూములను సైతం అమ్మివేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో వసాయ్ భూమి విలువ రూ. 1111 కోట్లుకాగా, జోధ్‌పూర్ భూమి విలువ రూ. 140 కోట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విధంగా పుణేలోని భూమిని సైతం విక్రయించే చర్చల్లో ఉన్నట్లు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement