మొబైల్ పేమెంట్ యాప్‌లకు భారీ జరిమానా | RBI Penalises Five PPI issuers | Sakshi
Sakshi News home page

మొబైల్ పేమెంట్ యాప్‌లకు భారీ జరిమానా

May 4 2019 6:54 PM | Updated on May 4 2019 7:07 PM

RBI Penalises Five PPI issuers - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, ముంబై :  రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా  ఫోన్‌పేతో సహా నిబంధనలు ఉల్లంఘించిన ఐదు ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) సంస్థలకు  భారీ జరిమానా విధించింది.   ముఖ్యంగా  వొడాఫోన్ ఎం-పేసా, ఫోన్‌ పే మొబైల్ పేమెంట్స్, వై-క్యాష్ తదితర సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు ప్రమాణాలు పాటించని అమెరికా సంస్థలు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్‌పైనా ఆర్బీఐ కొరడా ఝళిపించింది.  చెల్లింపులు, సెటిల్మెంట్స్ వ్యవస్థల చట్టం- 2007 కింద ఆయా సంస్థలకు ద్రవ్య పెనాల్టీ విధించినట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

వొడాఫోన్‌ ఎం-పేసాకు రూ.3.05 కోట్ల జరిమానా, మొబైల్ పేమెంట్స్, ఫోన్ పే, ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీలకు రూ.1 కోటి చొప్పున జరిమానా విధించింది. వై-క్యాష్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కి కూడా రూ. 5 లక్షల పెనాల్టీ విధించింది. వీటితోపాటు  వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్ సంస్థలకు వరుసగా రూ. 29.66 లక్షలు, రూ. 10.11 లక్షల మేర ఆర్‌బీఐ జరిమానా విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement