‘హ్యాపీ మొబైల్స్’.. ఒకే రోజు 20 స్టోర్లు
హెదరాబాద్: మల్టీబ్రాండ్ మొబైల్స్ రిటైల్ దుకాణాల సంస్థ ‘హ్యాపీ మొబైల్స్’ ఒకే రోజున శుక్రవారం హైదరాబాద్లో కొత్తగా 20 స్టోర్లను ప్రారంభించింది. చందానగర్ స్టోర్ను ప్రముఖ నటుడు రామ్చరణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ పవన్, డైరెక్టర్ సంతోష్ పాల్గొన్నారు.
కస్టమర్లకు మొబైల్స్ కొనుగోలు విషయంలో సరికొత్త అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఉన్న ఈ సంస్థ తొలి ఏడాదిలోనే 150–200 స్టోర్లను ప్రారంభించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది.