సెల్‌ఫోన్లపై జీఎస్టీ ఇకపై 18%

Mobile phones to cost more as GST rate hiked to 18persant - Sakshi

6 శాతం పెంపు

జీఎస్టీ నెట్‌వర్క్‌ డిజైన్‌ మార్పు బాధ్యత ఇన్ఫోసిస్‌కు

ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్లపై జీఎస్టీని 18 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయించింది. ఇది ఏప్రిల్‌ 1నుంచి అమలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ఇక్కడ జరిగిన 39వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఈ మేరకు అంగీకరించింది. వినియోగదారుల సమస్యలను అధిగమించేలా జీఎస్టీ నెట్‌వర్క్‌ డిజైన్‌ మెరుగుపరచాలని ఈ సమావేశం ఇన్ఫోసిస్‌ను కోరింది.

► పూర్తి స్థాయిలో జీఎస్టీ నెట్‌వర్క్‌ సామర్ధ్యం పెంపు, నిపుణులైన సిబ్బంది నియామకం, సమస్యలకు సులభ పరిష్కారాలు చూపడం వంటివి ఈ ఏడాది జూలై కల్లా పూర్తి కావాలి. కొత్త వ్యవస్థ 2021 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది.
► మొబైల్‌ ఫోన్లు, కొన్ని కీలక విడిభాగాలపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచింది.
► విమానాల మెయింటెనెన్స్‌ అండ్‌ రిపైర్, ఓవర్‌హౌల్‌(ఎంఆర్‌వో)సేవలపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఎంఆర్‌వో సేవలు దేశంలోనే ప్రారంభం కావడానికి అవకాశం ఏర్పడుతుంది.
► ఈ–వాయిస్, క్యూఆర్‌ కోడ్‌ అక్టోబర్‌ ఒకటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
► ఎగుమతిదారులకు ఈ–వాలెట్‌ స్కీం నమోదు గడువును 2021 మార్చి 31కి పొడిగించింది.
► ఆలస్యమైన జీఎస్టీ చెల్లింపులపై వడ్డీని జూలై 2017 నుంచి అమలయ్యేలా చట్టాన్ని సవరణకు నిర్ణయం.
► మార్చి 14 వరకు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు రద్దయిన వారు కావాలనుకుంటే తిరిగి జూన్‌ 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
► 2018–19 సంవత్సరంలో రూ.5 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి వ్యాపార సంస్థలకు జీఎస్‌టీఆర్‌–9సీ దాఖలు చేయనవసరం లేకుండా మినహాయింపు నిచ్చింది.
► జీఎస్టీ కింద రిజిస్టరయిన ప్రతి వ్యక్తి తన వ్యాపారానికి అనుగుణంగా సరఫరాదారుల ప్రాథమిక సమాచారం తెలుసునేందుకు వీలుగా త్వరలో ‘నో యువర్‌ సప్లయర్‌’ పేరుతో కొత్త సౌకర్యం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top