
దీనివల్ల ఇన్వెస్టర్లకు 60వేల కోట్లు లాస్
సిగరెట్ ఉత్పత్తులపై సెస్ను పెంచుతున్నట్టు ప్రకటించిన జీఎస్టీ కౌన్సిల్, సిగరెట్ ఉత్పత్తుల అగ్రగామి సంస్థ ఐటీసీకి షాకిచ్చింది.
ముంబై : సిగరెట్ ఉత్పత్తులపై సెస్ను పెంచుతున్నట్టు ప్రకటించిన జీఎస్టీ కౌన్సిల్, సిగరెట్ ఉత్పత్తుల అగ్రగామి సంస్థ ఐటీసీకి షాకిచ్చింది. ఈ షాక్కు ఇన్వెస్టర్లందరూ ఒక్కసారిగా అమ్మకానికి పోటెత్తారు. దీంతో ఐటీసీ కంపెనీ షేర్లు మంగళవారం ట్రేడింగ్లో అతిపెద్ద పతనాన్ని నమోదుచేస్తూ 15 శాతం మేర క్రాష్ అయ్యాయి. ఈ క్రాష్తో కంపెనీ మార్కెట్ విలువ రూ.3.37 లక్షల కోట్లకు పడిపోయింది. సోమవారం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.3.96 లక్షల కోట్లు. అంటే దాదాపు రూ.60వేల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఐటీసీ దెబ్బ ఇటు స్టాక్ మార్కెట్లకు భారీగానే కొట్టింది. సెన్సెక్స్ ఈ ఏడాదిలో అతిపెద్ద పతనాన్ని నమోదుచేసింది. స్టాక్ మార్కెట్లో హై వెయిటేజీ ఉన్న షేర్లలో ఐటీసీ ఒకటి. నిఫ్టీలో కూడా ఇదే రెండో అతిపెద్ద వెయిటేజీ సంస్థ.