వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.
కావలి: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు.సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతుల సమస్యలు పరిష్కరించే వరకు వైఎస్ఆర్ సీపీ నేతలు పోరాటం సాగిస్తారని ఆయన అన్నారు.