తెలంగాణ కోసం మరో యువకుడి బలిదానం | youngster commits suicide for telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ కోసం మరో యువకుడి బలిదానం

Feb 14 2014 12:41 AM | Updated on Aug 18 2018 4:13 PM

పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీల తీరుతో... తెలంగాణ రాదేమోనని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘

సీమాంధ్ర ఎంపీల తీరుతో ఆత్మహత్య

మొయినాబాద్,న్యూస్‌లైన్: పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీల తీరుతో... తెలంగాణ రాదేమోనని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘సీమాంధ్ర ఎంపీల వైఖరి వల్లే చనిపోతున్నాను’ అంటూ సూసైట్ నోట్ రాసిపెట్టి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చాకలిగూడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. హైదరాబాద్ పురానాపూల్ ప్రాంతానికి చెందిన జన్న మహేష్(32) మొయినాబాద్ మండలం చాకలిగూడలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. భార్య రజిత గురువారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన అనంతరం మహేష్ ఇంట్లోనే ఉండిపోయాడు. సాయంత్రం రజిత ఇంటికి వచ్చేసరికి భర్త ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. మహేష్ జేబులో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement