తరిమెల (శింగనమల) : ‘ఏ ఒక్క రైతుకూ రుణ మాఫీ సక్రమంగా చేయలేదు.. రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి మాట మార్చారు. రైతుకు రూ.ఒకటిన్నర లక్ష వరకు రుణమాఫీ అని చె ప్పారు. కనీసం అది కూడా వేయకుండా మోసం చేశార’ని రైతు సాధికరత సదస్సుకు వచ్చిన రైతులు గురువారం అధికారులను నిలదీశారు. ఈ సంఘటన శింగనమల మండలం తరిమెలలో చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు సదస్సును బాయ్ కాట్ చేశారు.
తరిమెల గ్రామంలో రుణ మాఫీపై రైతు సాధికారత సదస్సు ప్రారంభం కాగానే.. రైతులకు ప్రభుత్వం రుణాలు మాఫీ చేసిందని, అందుకు గాను రైతులకు విముక్తి పత్రాలు అందించనున్నట్లు ఎంపీడీఓ లలితకుమారి తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.‘ఈ పత్రాలు తీసుకుని ఏం చేయూలి? అంతా మోసం చేశారు.. రుణాలు పూర్తిగా మాఫీ అని చెప్పి, రకరకాల పేరుతో తగ్గించేశారు.. గ్రామంలో ఎంత మందికి పూర్తిగా రుణం పోయిందో చెప్పండ’ని అధికారులను నిలదీశారు.
పత్రాలను బ్యాంకులకు తీసుకుని పోతే, రేపు తిరిగి రుణాలు మంజూరు చేస్తారని అధికారులు నచ్చజెప్పారు. ఈ విషయూన్ని ఎంత వరకు నమ్మాలని.. అక్కడే ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ మనోహర్ను రైతులు ప్రశ్నించారు. బ్యాంకులకు అలాంటి ఆదేశాలు ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే రైతులకు తెలియజేస్తామని చెప్పారు. ఎందుకూ ఉపయోగం లేని ఈ పత్రాలు ఎందుకని అధికారులను ప్రశ్నించారు. బ్యాంకులలో మాఫీ అయినప్పుడు ఇస్తే తీసుకుంటామని, అంతవరకు ఈ పత్రాలు మీదగ్గరే పెట్టుకోవాలని అధికారులకు సూచించారు.
రైతులు హనుమంతురెడ్డి, బాలిరెడ్డి, కోటేశ్వర్రెడ్డి, క్రిష్ణారెడ్డి, సీపీఐ నాయకులు రామాంజినేయులు మాట్లాడుతూ రైతులను నిలువునా మోశారని ఆవేదన చెందారు. రుణాలు పూర్తిగా మాఫీ అని చెప్పి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాట మార్చారన్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. రూ.50 వేలు ఏ ఒక్కరికీ మాఫీ కాలేదన్నారు. ఇది రైతులను దగా చేయడమేనన్నారు. పింఛన్ల విషయంలో కూడా అలాగే చేశారని మండిపడ్డారు. గ్రామంలో 90 మంది పింఛన్లు తొలగిస్తే, కేవలం 10 మందికి మాత్రమే పునరుద్దరించారని, మిగిలిన వారికి రాలేదని ప్రశ్నించారు. గ్రామంలో ఇంకా చాలా మంది రైతుల పేర్లు రుణ మాఫీ జాబితాలో లేవన్నారు. రైతులకు పూర్తిగా మాఫీ అయిన తరువాత ఈ పత్రాలు అందించాలని రైతులందరం బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పి అందరు వెళ్లిపోయారు. దీంతో సదస్సును అధికారులు నిలిపి వేశారు. సదస్సులో ఈఓఆర్డీ యశోదమ్మ, ఏఏఓ శైలజ, ఆత్మ పీపీఎం లావణ్య, వీఆర్వో భరత్కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆదినారాయణ పాల్గొన్నారు.
ఈ పేపర్లు ఏం చేసుకోవాలి?
Published Fri, Dec 12 2014 2:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement