తాడేపల్లిగూడెం : కేంద్ర ప్రభుత్వం ‘అమృత్’ పేరిట కొత్తగా ప్రకటించిన అటల్ పట్టణ రూపాంతరీకరణ, పునరుజ్జీవన పథకానికి ఏలూరు నగరం, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాలు ఎంపికయ్యాయి. హడ్కో ఆధ్వర్యంలో అటల్ మిషన్ ఫర్ రీ జువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (అమృత్) పేరిట దేశంలోని ముఖ్య పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టిన విషయం విదితమే.
ఈ పథకం కింద రాష్ట్రంలో 31 పట్టణాలను అభివృద్ధి చేయనుండగా, వాటిలో ఏలూరు నగరం, సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీలైన తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాలకు స్థానం దక్కింది. పట్టణ పేదలకు గృహాలు, పట్టణంలో ప్రధాన మౌలిక సదుపాయా లు, సుందరీకరణ, రవాణా, సమాచార వ్యవస్థలతోపాటు పచ్చదనం అభివృద్ధి తదితర కార్యక్రమాలను అమృత్ పథకం కింద చేపడతారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇప్పటికే అమలులో ఉన్న అందరికీ ఇల్లు పథకాన్ని కూడా ఇందులో చేర్చారు. తద్వారా పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.లక్ష నుంచి రూ.2.30 లక్షల వరకు నిధులిస్తారని సమాచారం.
అభివృద్ధికి అవకాశం
అమృత్ పథకం కింద ఒక్కొక్క పట్టణానికి కనీసం రూ.100 కోట్ల వరకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నిధులు అభివృద్ధి పనులు చేపట్టడానికి అక్కరకు వస్తాయని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో మోటారు వాహనాల వినియోగం తగ్గించి సైకిళ్ల వినియోగాన్ని పెంచుతారు. ఇందుకు వీలుగా సైకిల్ ట్రాక్లు, ఆరోగ్యం కోసం నడక నడవటానికి వీలుగా వాకింగ్ ట్రాక్లు, వీటితోపాటు సాయంత్రం, ఉదయం వేల ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు వీలుగా సుందరీకరణ పేరిట పార్కులు వంటివి అమృత్ పథకం కింద సమకూరతాయని పురపాలకులు ఆశిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది.
పట్టణాలకు వరమే
మునిసిపాలిటీల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకంలో జిల్లాలోని మూడు పట్టణాలకు చోటు దక్కడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశాలు మెరుగవుతాయని పురపాలకలు సంబరపడుతున్నారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయమంతా ఖర్చులకే సరిపోతోంది. ఆర్థిక సంఘం నిధులిస్తున్నా.. అప్పులు, వేరే ఖాతాలకు మళ్లిపోతున్నాయి. చిన్నపాటి పని చేయాలన్నా ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నవిధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘అమృత్’ పథకానికి ఎంపికైన మూడు పట్టణాలకు ఎంతోకొంత మేలు జరుగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆ పట్టణాలిక ‘అమృత’ధామాలు
Published Fri, Jun 26 2015 2:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement