టీడీపీ మేనిఫెస్టో కాపీలు దహనం | tdp manifesto burnt in vizianagaram district | Sakshi
Sakshi News home page

టీడీపీ మేనిఫెస్టో కాపీలు దహనం

Jun 8 2015 9:17 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఏడాది పాలనలో ఇచ్చిన హామీల అమలులో టీడీపీ విఫలమైందని నిరసిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టోలను విజయనగరం, బొబ్బిలి పట్టణాల్లో కాంగ్రెస్ నేతలు సోమవారం దహనం చేశారు.

బొబ్బిలి (విజయనగరం): ఏడాది పాలనలో ఇచ్చిన హామీల అమలులో టీడీపీ విఫలమైందని నిరసిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టోలను విజయనగరం, బొబ్బిలి పట్టణాల్లో  కాంగ్రెస్ నేతలు సోమవారం దహనం చేశారు. విజయనగరం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ హామీని టీడీపీ నేర్చవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి నిరసగా ఆ పార్టీ ఎన్నిల మేనిఫెస్టో 365  ప్రతులను దహనం చేశారు. బొబ్బిలిలో జరిగిన కార్యక్రమంలో మాజీ విప్ శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ ఏడాది పాలనలో టీడీపీ అన్ని వర్గాల వారినీ ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement