టీడీపీ అరాచకపాలన తట్టుకోలేకే..

TDP leaders join YSRCP  - Sakshi

వైఎస్సార్‌ సీపీలో చేరిన టీడీపీ నాయకులు 

సాదరంగా ఆహ్వానించిన  బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి

రేపల్లె: దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్‌ సీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. మండలంలోని పేటేరుకు చెందిన టీడీపీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరిని మోపిదేవి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌ సీపీలో చేరిన శొంఠి సురేష్, సాంబశివరావు మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న టీడీపీ అరాచపాలనను భరించలేక వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్లు చెప్పారు. 

జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యమన్నారు. వీరితో పాటు శొంఠి బాలకృష్ణ, వాకా నాగబాబు, శొంఠి సురేష్, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శంకర్, వీరంకి రవీంద్ర, చెన్ను పాండు, వీరంకి భాగ్యారావు, మరో 30 మంది వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్‌ గడ్డం రాధాకృష్ణమూర్తి, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా శ్రీనివాసరావు తదితరులు  పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top