గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు | special trains by guntur | Sakshi
Sakshi News home page

గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

Feb 1 2015 5:53 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు - Sakshi

గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరిలో గుంటూరు మీదుగా ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరిలో గుంటూరు మీదుగా ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రైళ్ల వివరాలను ప్రకటించారు. రైల్ నెంబరు: 07207, విజయవాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 5,12వతేదీల్లో నడుపనున్నారు. ఇది విజయవాడలో రాత్రి 11గంటలకు బయలుదేరి మంగళగిరి, గుంటూరు, నల్లగొండల మీదుగా సికింద్రాబాద్‌కు మరుసటి రోజు తెల్లవారుజామున 5.40కి చేరుకుంటుంది. రైల్ నెంబరు: 07208, సికింద్రాబాద్-విజయవాడ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 8,15వ తేదీల్లో నడుపనున్నారు. ఇది రాత్రి 11.15కు సికింద్రాబాద్‌లో బయలు దేరి నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా ఉదయం 5.45కి విజయవాడ చేరుకుంటుంది.

రైల్ నెంబరు: 07202. ఇది సికింద్రాబాద్-కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు. ఈ రైలు ఫిబ్రవరి 6,13వ తేదీల్లో ప్రయాణిస్తుంది. ఇది రాత్రి 7.15గంటలకు బయలు దేరి నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి,పిడుగురాళ్ల,సత్తెనపల్లి మీదుగా గుంటూరుకు చేరుకుని,విజయవాడ, ఏలూరు,తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా మరుసటిరోజు కాకినాడకు చేరుకుంటుంది. రైల్ నెంబరు: 07201, ఈ రైలు కాకినాడటౌన్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు. ఈ రైలును ఫిబ్రవరి 7,14వతేదీల్లో నడపనున్నారు. ఇదిసాయంత్రం 6.30గంటలకు బయలుదేరి రాత్రి 11.50కు సామర్లకోట, రాజమండ్రి,, తాడేపల్లిగూడెం, ఏలూరు,విజయవాడ మీదుగా గుంటూరు చేరుకుని, మరుసటిరోజు ఉదయం 510 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement