
శ్రీకాకుళం :‘నా భర్త చనిపోయాడు. ఆరేళ్ల కుమార్తె పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఏ ఆధారం లేకపోవడంతో తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాను. డిగ్రీ చదివినా ఎలాంటి ఉద్యోగావకాశాలు రాలేదు. కూతురి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది’ అంటూ వీరఘట్టం మండలం విక్రంపురానికి చెందిన కోటేశ్వరి జగన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె సమస్యలను విన్న జగన్ త్వరలోనే న్యాయం చేస్తానని ధైర్యం చెప్పారు.