మూల్యాంకనంలో తప్పిదాలపై విద్యాశాఖ సీరియస్గా ఉంది. కొందరి నిర్లక్ష్యంతో ఏటా ఎందరో విద్యార్థులు ఫెయిల్కావడం, తక్కువ మార్కులు పొందడం వంటివి జరుగుతున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు గురువులపై గురిపెట్టాయి. ఒకటి, రెండు తప్పిదాలకు నోటీసులు జారీ చేయడం, అంతకన్న ఎక్కువ ఉంటే జరిమానాతో పాటు శాశ్వతంగా మూల్యాంకనం నుంచి తప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. రెండేళ్ల నుంచి ఎస్ఎస్సీ బోర్డు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ బోర్డు అమలుపర్చనుంది.
జంకుతున్న గురువులు
స్పాట్వాల్యుయేషన్లో తక్కువ సమయంలో ఎక్కువ జవాబు పత్రాలు మూల్యాంకనం చే సి డబ్బులు దండుకోవాలనే వారికి ఇదీ చేదు వార్తే. విద్యార్థులు తమకెన్ని మార్కులు వచ్చాయో, చేసిన తప్పిదాలేంటో తెలుసుకోవడానికి ఆయా బోర్డులు జవాబు జిరాక్స్ పత్రాలు ఇస్తున్నాయి. ఇందులో తప్పుగా దిద్దినట్లు తేలితే విద్యార్థులు నేరుగా కోర్టుకు వెళ్లవచ్చు. పునఃపరిశీలనలో మార్కులు పెరుగుదలను బట్టి ఉపాధ్యాయులు, అధ్యాపకులపై చర్యలు ఉంటాయి. దీంతో మూల్యాంకనంలో పాల్గొనేందుకు గురువులు జంకుతున్నారు. 2012-13 మార్చి, ఏప్రిల్లో జరిగిన మూల్యంకనంలో జిల్లా వ్యాప్తంగా 102 మంది వరకు తప్పిదాలు చేశారు. ఇందులో ఏఈలు, సీఈలకు చిన్నతప్పిదాలకు పాల్పడ్డ వారికి తదుపరి మూల్యంకనానికి అనర్హులుగా ప్రకటించింది. ఐదు తప్పులు చేసిన ఏఈ, సీఈలకు రూ.500 నుంచి రూ.2 వేల వరకు జరిమానా విధింపుతోపాటు వారికి ఎస్సెస్సీ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
జరిమానా ఇలా..
పదో తరగతి మూల్యాంకనంలో తప్పిదాలకు పాల్పడే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు, జరిమానా విధిస్తారు. ఒకటి నుంచి ఐదు తప్పిదాలు చేసిన ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు, ఆరు నుంచి 10 తప్పిదాలకు ఎగ్జామినర్లకు రూ.500, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.200, 11 నుంచి 20 తప్పిదాలకు ఎగ్జామినర్ రూ.వెయ్యి, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.500, 21 నుంచి 30 తప్పిదాలకు ఎగ్జామినర్లకు రూ.1,500, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.700, 30కి పైగా తప్పిదాలకు ఎగ్జామినర్లకు రూ.2 వేలు, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.వెయ్యి జరిమానా విధించడంతోపాటు మూల్యాంకనం విధులు అప్పగించరు. ఈ సంవత్సరం ఇదే పద్ధతి ఇంటర్లో అమలుకానుంది.
మూల్యాంకనంలో తప్పులపై సీరియస్
Published Thu, Apr 17 2014 4:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement