విద్యాహక్కు చట్టం అమలైతేనే పాఠశాలల అభివృద్ధి | School development on Education Act | Sakshi
Sakshi News home page

విద్యాహక్కు చట్టం అమలైతేనే పాఠశాలల అభివృద్ధి

Dec 13 2013 4:23 AM | Updated on Jul 11 2019 5:01 PM

విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తేనే పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్ అన్నారు.

భద్రాచలం రూరల్, న్యూస్‌లైన్: విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తేనే పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని పినపల్లి, ఎంపీకాలనీ, తాతాగుడిసెంటర్, జగదీష్‌కాలనీ పాఠశాలలను తన బృందంతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ సమావేశ మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ పాఠ్యాంశాలను సకాలంలో పూర్తి చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి పాఠశాల అభివృద్ధిపై చర్చించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మాధవరావు, ఎన్‌ఐఆర్‌డీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్, సురేష్, జ్యోతి, ఏఎంఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.  
 
 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
 ఏన్కూరు : విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ విజయ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని తూతకలింగన్నపేట, ఏన్కూరు కస్తూర్బా పాఠశాలలను తన బృందంతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. పాఠశాలల్లో భోజనాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్య ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ రాష్ట్రాలలోని పాఠశాలలను తమ బృందం పరిశీలిస్తోందని తెలిపారు. సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, భవన నిర్మాణాలు, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు తదితర అంశాలపై నివేదిక తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement