'శ్రీశైలం జలాశయంలోని నీళ్లు సీమకే దక్కాలి' | rayalaseema students protest on srisailam water issue | Sakshi
Sakshi News home page

'శ్రీశైలం జలాశయంలోని నీళ్లు సీమకే దక్కాలి'

Nov 2 2014 2:36 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం ప్రాజెక్టు(ఫైల్) - Sakshi

శ్రీశైలం ప్రాజెక్టు(ఫైల్)

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రాయలసీమ విద్యార్థులు ఆదివారం ఆందోళనకు దిగారు.

శ్రీశైలం: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రాయలసీమ విద్యార్థులు ఆదివారం ఆందోళనకు దిగారు. శ్రీశైలం జలాయశంలోని నీరు రాయలసీమకే దక్కాలంటూ నినదించారు. లెఫ్ట్ పవర్ హౌస్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యార్థులతో ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంప్రవేశం చేశారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. 'శ్రీశైలం'పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement