రాజమండ్రిలో నిన్న అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు క్షేమంగా ఉన్నారు.
రాజమండ్రి : రాజమండ్రిలో నిన్న అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. రాజమండ్రిలోని శ్రీచైతన్య టెక్నోస్కూల్లో
చదువుతున్న సుష్మా సువాసిని, పులగం రేష్మానాయుడు, సింధు జాహ్నవిలు నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దాంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా సింధు జాహ్నవి బంధువుల ఇంట్లో ఉన్నట్లు సమాచారం. దాంతో విద్యార్థినిల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.