ప్రాథమిక పాఠశాలలో పేలిన కుక్కర్‌ | Pressure Cooker Blast in Government School Anantapur | Sakshi
Sakshi News home page

ప్రాథమిక పాఠశాలలో పేలిన కుక్కర్‌

Feb 23 2019 12:06 PM | Updated on Jul 26 2019 6:25 PM

Pressure Cooker Blast in Government School Anantapur - Sakshi

తరగతి గదిలోనే వంట చేస్తున్న నిర్వాహకురాలు

అనంతపురం , కూడేరు: కడదరగుంట ప్రాథమిక పాఠశాలలో కుక్కర్‌ పేలింది. వివరాల్లోకి వెళ్తే... స్కూల్‌లో 70 మంది విద్యార్థులున్నారు. రెండు గదులు, వరండా ఉంది. మధ్యహ్న భోజనం తయారు చేయడానికి వంట గది లేకపోవడంతో నిర్వాహకులు వరండాలోని తరగతి గదిలోనే మూలన వండుతున్నారు. శుక్రవారం కుక్కర్‌లో పప్పును తయారు చేస్తుండగా ఉన్నట్టుండి పేలింది. పిల్లలు అప్రమత్తమై పక్కకు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. వంటగదిని నిర్మించి ఇబ్బంది లేకుండా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement