ప్రాథమిక పాఠశాలలో పేలిన కుక్కర్‌

Pressure Cooker Blast in Government School Anantapur - Sakshi

అనంతపురం , కూడేరు: కడదరగుంట ప్రాథమిక పాఠశాలలో కుక్కర్‌ పేలింది. వివరాల్లోకి వెళ్తే... స్కూల్‌లో 70 మంది విద్యార్థులున్నారు. రెండు గదులు, వరండా ఉంది. మధ్యహ్న భోజనం తయారు చేయడానికి వంట గది లేకపోవడంతో నిర్వాహకులు వరండాలోని తరగతి గదిలోనే మూలన వండుతున్నారు. శుక్రవారం కుక్కర్‌లో పప్పును తయారు చేస్తుండగా ఉన్నట్టుండి పేలింది. పిల్లలు అప్రమత్తమై పక్కకు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. వంటగదిని నిర్మించి ఇబ్బంది లేకుండా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top