15న పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు

Potti Sriramulu Death Anniversary Will Be Celebrated State Wide In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 15న రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని వేడుకలను రాష్ట్రమంతటా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం ఆదేశాలు జారీచేసింది. డిసెంబరు 15 ఆదివారం సెలవురోజు కావడంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ముందస్తుగా ఆదేశాలు జారీ చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top