పేదల భూముల్లో ‘నీరు-చెట్టు’ పనులా ? | Poor lands in Water-tree program! | Sakshi
Sakshi News home page

పేదల భూముల్లో ‘నీరు-చెట్టు’ పనులా ?

May 31 2016 11:52 AM | Updated on Jun 4 2019 5:16 PM

భూస్వాములు కబ్జా చేసిన చెరువులను వదిలేసి, దళిత,ఆదివాసీలు సాగు చేసుకుంటున్న చెరువుల్లో...

రైతు కూలీ సంఘం నాయకులు
విజయనగరం కంటోన్మెంట్ : భూస్వాములు కబ్జా చేసిన చెరువులను  వదిలేసి, దళిత,ఆదివాసీలు సాగు చేసుకుంటున్న చెరువుల్లో (నీరు లేనివి) ‘నీరు-చెట్టు’ పనులు ఎలా చేపడతారని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలగాడ కృష్ణ, పి. మల్లిక్, ప్రగతి శీల మహిళా సంఘ జిల్లా కన్వీనర్ పి. రమణి, తదితరులు ప్రశ్నించారు. ఈ మేరకు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెరువు గర్భాల్లో సాగు చేసుకుంటున్న దళితులకు భవిష్యత్‌లో ప్రభుత్వం సాగు హక్కు కల్పించే అవకాశం ఉందన్నారు. వారి పొట్టకొట్టడానికే ప్రభుత్వం ‘నీరు-చెట్టు’లో భాగంగా జేసీబీతో పనులు చేపడుతోందని తెలిపారు. టీడీపీ నాయకులకు లాభం చేకూరేలా  ఈ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. పెత్తందారులు స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కుమ్మక్కై పేదలు సాగు చేస్తున్న చెరువుల్లోనే పనులు చేపట్టడం దారుణమన్నారు. అనంతరం కలెక్టర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement