అడుగులో అడుగు వేస్తూ.. | Palavalasa Vikranth In Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

అడుగులో అడుగు వేస్తూ..

Nov 20 2018 6:59 AM | Updated on Nov 20 2018 6:59 AM

Palavalasa Vikranth In Praja Sankalpa Yatra - Sakshi

ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడుస్తున్న పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు, పాలవలస విక్రాంత్‌

పాలకొండ రూరల్‌/రాజాం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరువలో ఉన్న నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌ విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గానికి చేరుకుని పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో జరగనున్న పాదయాత్రకు సంబంధించి మట్లాడారు. సిక్కోలు వాసులు జననేత రాక కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని తెలిపారు. ఇరు నియోజకవర్గాల్లో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యలు ప్రస్తావిస్తూనే తమ సమస్యలపై స్థానికులకు  భరోసా కల్పించాలని ఆయనను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement