ప్రజల జీవితానికి భద్రత లేదు : ఆనం | No Protection To People Life In Chandrababu Government | Sakshi
Sakshi News home page

ప్రజల జీవితానికి భద్రత లేదు : ఆనం

Mar 4 2019 5:55 PM | Updated on Mar 4 2019 9:26 PM

No Protection To People Life In Chandrababu Government - Sakshi

సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ గ్రిడ్‌ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసాలు వెలుగు చూశాయని, బూత్ కమిటీల పరిశీలన వల్లే ఈ అక్రమాలు బయట పడ్డాయని వైఎస్సార్‌ సీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహించి ఓట్లను తొలగిస్తున్న తీరును బట్టి చూస్తే..  రాష్ట్రంలో ప్రజల జీవితాలకు భద్రత లేదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ నాయకుడికి మద్దతు ఇస్తున్నారో తెలుసుకుని వారి ఓట్లను తొలగిస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌లు ఈ కుంభకోణం వెనుక వున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌ల తప్పిదాలు బయటపడకుండా ఉండేందుకు కొన్ని పత్రికలు ఎదురుదాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ సమాచారం ప్రైవేట్ సంస్థలకు ఎలా వెళ్లిందో ఎన్నికల సంఘం విచారణ చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement