సాక్షి ప్రతినిధి, ఒంగోలు
మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం వేట ప్రారంభించింది. అభ్యర్థుల ఆశావహుల జాబితాతో హైదరాబాద్ రావాలని జిల్లా నాయకులకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నుంచి పిలుపు రావడంతో జిల్లా నుంచి నేతలు హైదరాబాద్కు బయలుదేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు కరువవడంతో తృతీయ శ్రేణి నాయకుల జాబితాతో జిల్లా నేతలు వెళ్లినట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ప్రస్తుత ఒంగోలు నగర అధ్యక్షునిగా ఉన్న జడా బాల నాగేంద్రం డీసీసీ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాల నాగేంద్రం, పీసీసీ కార్యదర్శి కోలా ప్రభాకర్ గురువారం హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. వీరు బొత్సతో శుక్రవారం భేటీ అయి మునిసిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. వారికే బీఫామ్లు కూడా ఇచ్చి అభ్యర్థులను పోటీకి దింపాలని బొత్స కోరనున్నట్లు సమాచారం.
పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలోనే ఆదుకోవాలని, ఇతర నేతల్లాగా పార్టీలు మారడం సరికాదని వీరికి నచ్చజెప్పే యత్నం కూడా బొత్స చేయనున్నారు. జిల్లాలో పార్టీ చతికిలపడిందనే భావన రాకుండా, అన్ని వార్డుల్లో అభ్యర్థులుండేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిసింది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో చైర్మన్ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ హయాంలో వైభవాన్ని చాటిన కాంగ్రెస్ పార్టీ, నేడు అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోందని ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉండటంతో జిల్లాలో పార్టీకి దశ, దిశ కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా పూర్తి స్థాయి డీసీసీ అధ్యక్షుడిగా బాల నాగేంద్రంని నియమించే అవకాశ ం ఉన్నట్లు తెలిసింది. జిల్లా పూర్తి బాధ్యతలను ఆయనకు అప్పగించడానికి బొత్స నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అభ్యర్థులేరీ..?
Published Fri, Mar 7 2014 2:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement