అర్చకుల ట్రస్ట్‌’ చైర్మన్‌గా ఐవైఆర్‌ తొలగింపు | news about iyr krishna rao | Sakshi
Sakshi News home page

అర్చకుల ట్రస్ట్‌’ చైర్మన్‌గా ఐవైఆర్‌ తొలగింపు

Feb 23 2018 2:47 AM | Updated on Feb 23 2018 2:47 AM

news about iyr krishna rao - Sakshi

సాక్షి, అమరావతి: అర్చకుల, ఉద్యోగుల సంక్షేమ ఫండ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తప్పించారు. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపిస్తున్నారన్న కక్షతో ఐవైఆర్‌ను బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి నుంచీ తొలగించిన విషయం విదితమే.

Advertisement