సూది సైకో కలకలం | Sakshi
Sakshi News home page

సూది సైకో కలకలం

Published Sun, Sep 27 2015 11:09 AM

needle Psycho Terror @ Rajamandri

సూదితో ఓ వ్యక్తి తన చేతిపై గుచ్చాడంటూ ఓ మహిళ రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం హైరానా సృష్టించింది. బాధితులు, వైద్యుల కథనం మేరకు... తూర్పుగోదావరి జిల్లా ఐనవోలు మండలం జోగిరాజుపాలెంకు చెందిన ఎడ్ల అనూష (35) కుటుంబ సభ్యులతో కలసి నిజామాబాద్ జిల్లా వర్ని వెళ్లి.. ఆదివారం ఉదయం నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో దిగింది. మూడో నంబర్ ప్లాట్‌ఫారం నుంచి మెట్లు ఎక్కి దిగి వచ్చే క్రమంలో ఓ వ్యక్తి సూదితో గుచ్చాడంటూ ఆమె కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే, చేతిపై ఎక్కడా సూది గాయం లేదని, ఫోబియోతో ఆమె అలా భ్రమపడి ఉంటుందని డాక్టర్ చలం తెలిపారు.
 

Advertisement
Advertisement