ఇద్దరు మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవల రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వీరిద్దరు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని ఆమోదిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ నెల 22న పిల్లి సుభాష్చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు.(కరోనా నివారణకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి