సాక్షి, అమరావతి: అమ్మఒడి పథకం లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని గ్రామాలు,పాఠశాలల్లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలు పెట్టామని వెల్లడించారు. ఇప్పటి వరుకు 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. తెల్ల రేషన్కార్డు, ఆధార్, బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసి లబ్ధిదారులను గుర్తించామన్నారు. అమ్మ ఒడి పథకం కోసం రూ.6,400 కోట్లు కేటాయించామని తెలిపారు. ఈ నెల 9న చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో అమ్మఒడి పథకం అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. 5వ తేదీ వరకు ఎంతమంది లబ్ధిదారులను గుర్తిస్తే అంత మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ముందుగా ఒక్క రూపాయి ఖాతాల్లో వేసి లబ్ధిదారుల ఖాతాలను తనిఖీ చేస్తామని తెలిపారు. 9న ఒకేసారి రూ.15వేలు జమ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
పారదర్శకంగా ‘అమ్మఒడి’ లబ్ధిదారుల ఎంపిక
Published Sat, Jan 4 2020 11:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement