చంద్రబాబును కలిసిన లగడపాటి

Lagadapati Rajagopal meets Chandrababu in Amaravathi - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం భేటీ అయ్యారు. తన కుటుంబంలో ఈ నెల 27న జరగనున్న శుభకార్యానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు వచ్చానని లగడపాటి తెలిపారు.

రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్‌పై ఇప్పుడేమీ వ్యాఖ్యలు చేయలేనన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top