ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు సృష్టించింది.
ఒకే రోజు రెండుసార్లు జన్మభూమి!
Oct 6 2014 1:49 PM | Updated on Sep 2 2018 4:48 PM
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా హీరా మండలం జగ్గుపురంలో సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య విభేధాల కారణంగా ఒకే రోజు రెండుసార్లు జన్మభూమి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించాల్సి వచ్చింది.
సర్పంచ్, ఉప సర్పంచ్ ల మధ్య అవగాహన కొరవడటంతో అధికారులు తలలు పట్టకున్నారు. సర్పంచ్ అధ్యక్షతన ఒకసారి, ఉపసర్పంచ్ అధ్యక్షతన మరోసారి జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Advertisement


