సుజనా సంస్థల్లో ఈడీ సోదాలు | IT Rides on Y S Chowdary companies | Sakshi
Sakshi News home page

సుజనా సంస్థల్లో ఈడీ సోదాలు

Nov 24 2018 9:08 AM | Updated on Nov 24 2018 10:20 AM

IT Rides on Y S Chowdary companies - Sakshi

సాక్షి, హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లో ఈడీ అధికారులు దాడులు జరిపారు. నాగార్జున హిల్స్‌లో ఉన్నబెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీలో అధికారులు సోదాలు చేశారు. గత అక్టోబర్‌లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు చేశారు. డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సుజనాచౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. సుజనా చౌదరీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను డైరెక్టర్‌లుగా పెట్టి షెల్‌కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలు వచ్చాయి. గంగా స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బును మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే... కేవలం రసీదుల రూపంలో డబ్బులు మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై 2016ఫిబ్రవరిలోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 

గత అక్టోబర్‌లో ఈ కేసులకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున హార్డ్‌డిస్క్‌లు, ఫైల్స్‌తో పాటు కీలక డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకుంది. దాదాపు మూడు బ్యాంకుల నుంచి 304కోట్ల రూపాయలు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆంధ్రాబ్యాంకు నుంచి 60కోట్లు, కార్పోరేషన్‌ బ్యాంకు 120, సెంట్రల్‌బ్యాంకు 124కోట్లు అప్పుగా తీసుకున్నారు. చాలావరకు నిధులను డొల్లకంపెనీలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల ఫొరెన్సిక్ ఆడిటింగ్‌లోనూ ఈ విషయం తేటతెల్లమైనట్లు తెలుస్తోంది. చాలా కంపెనీల లావాదేవీల్లో కేవలం రసీదులు తీసుకుని డబ్బు తరలించినట్లు సమాచారం. దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతున్న ఈ కేసుల విచారణ కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈడీ చేసిన సోదాల్లోనూ పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు దొరికినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement