ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందాడు.
	కర్నూలు : ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...  కోస్గి మండలానికి చెందిన జయమ్మ, రామప్ప దంపతులకు ఈరోజు ఉదయం పండంటి బాబు పుట్టాడు. అయితే బాబుకు ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో చిన్నారి మృతిచెందాడు. ఈ విషయమై బాలుడి తల్లి దండ్రులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
