పదవి నాకు లెక్కలోది కాదు: సీఎం కిరణ్ | I do not care for this seat, says Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

పదవి నాకు లెక్కలోది కాదు: సీఎం కిరణ్

Nov 15 2013 2:03 PM | Updated on Jul 29 2019 5:31 PM

పదవి నాకు లెక్కలోది కాదు: సీఎం కిరణ్ - Sakshi

పదవి నాకు లెక్కలోది కాదు: సీఎం కిరణ్

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య గళం వినిపించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య గళం వినిపించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సమైక్యం కోసం చేసే పోరాటంలో తన పదవిని సైతం లెక్క చేయనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతామన్నారు.

 

ఆ క్రమంలోనే నాగార్జున, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టగలిగామని కిరణ్ ఉదాహరించారు. విభజన నిర్ణయాన్నితనతోపాటు సీమాంధ్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. విభజనతో రెండు ప్రాంతాలకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రాంతానికే మరింత నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఓ వేళ విభజిస్తే హైదరాబాద్ విషయాన్ని ఏం చేస్తారని ఆయన కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట విభజనను పునఃపరిశీలించాలని సీఎం కిరణ్ ఈ సందర్భంగా కేంద్రానికి సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement