ఖమ్మం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా తాను కోరినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు.
ఖమ్మం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా తాను కోరినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించాలని పార్టీ ప్రజా ప్రతినిధుల సంతకాలతో కూడిన లేఖను ఏఐసీసీకి పంపినట్లు ఆయన చెప్పారు.
కాంగ్రెస్ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. దళారీ వ్యవస్థ లేకుండా కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని పొంగులేటి అన్నారు.