రాజధాని మార్పిడిలో భాగంగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు 2017 సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభించింది.
ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలకు సవరణలు
సాక్షి, అమరావతి: రాజధాని మార్పిడిలో భాగంగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు 2017 సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభించింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలను మార్చుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనగా సచివాలయ ఉద్యోగులెవరికీ ఈ ఏడాది సాధారణ బదిలీలు ఉండవు.
అలాగే హైదరాబాద్ నుంచి విభాగాధిపతుల కార్యాలయాలకు వచ్చిన వారిని కూడా ఈ ఏడాది బదిలీ చేయరు. ఇటీవలే హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.