టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఖలీల్ బాషా గుడ్ బై చెప్పారు. హైద్రాబాద్లోని లోటస్పాండ్లో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఖలీల్ బాషా మంగళవారం భేటీ అయ్యారు. కడప వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషాతో కలిసి ఖలీల్ బాషా వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ కండువా కప్పి ఖలీల్ బాషాని వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.