అసెంబ్లీలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన స్పీకర్ | Entry of Andhra Pradesh reorganisation bill in Assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన స్పీకర్

Dec 16 2013 10:12 AM | Updated on Jun 2 2018 3:39 PM

అసెంబ్లీలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన స్పీకర్ - Sakshi

అసెంబ్లీలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన స్పీకర్

స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను సభలో ప్రవేశపెట్టారు

హైదరాబాద్ : విపక్ష సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీ మరోసారి అరగంటపాటు వాయిదా పడింది. అంతకు ముందు వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను సభలో ప్రవేశపెట్టారు.  శాసనసభ కార్యదర్శి సదారాం బిల్లులోని అంశాలను చదివి వినిపించారు.

శాసనసభ వెబ్సైట్లో బిల్లు ప్రతిని ఉంచామని,  తెలుగు, ఉర్దూ అనువాద ప్రతులను సభ్యులకు అందుబాటులో ఉంచినట్లు స్పీకర్ తెలిపారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యే స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసనలు తెలిపారు. తమ నినాదాలతో అసెంబ్లీని హోరెత్తించారు. దాంతో స్పీకర్ సభను రెండోసారి వాయిదా వేశారు. ఇక శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో మండలి ఛైర్మన్ చక్రపాణి సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement