పట్టుకోండి చూద్దాం..! | Elderly women murdered madakasira | Sakshi
Sakshi News home page

పట్టుకోండి చూద్దాం..!

Feb 25 2016 3:55 AM | Updated on Aug 30 2018 5:24 PM

పట్టుకోండి చూద్దాం..! - Sakshi

పట్టుకోండి చూద్దాం..!

సంచలనం సృష్టించిన ఇద్దరు చిన్నారుల దారుణ హత్యోదంతం కేసును చాలెంజ్‌గా తీసుకుని అత్యంత చాకచక్యంగా....

పోలీసులకు సవాల్‌గా మారిన
వృద్ధురాలి హత్య, దోపిడీ కేసు
రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు, సీసీఎస్ పోలీసులు
అయినా చిన్న క్లూ కూడా
 సాధించని వైనంఅనుమానితులను
విచారణ చేయడానికే పరిమితం

  
సంచలనం సృష్టించిన ఇద్దరు చిన్నారుల దారుణ హత్యోదంతం కేసును చాలెంజ్‌గా తీసుకుని అత్యంత చాకచక్యంగా హంతకులను గుర్తించి పట్టుకున్న మడకశిర పోలీసులు అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఆ తరువాత జరిగిన భారతమ్మ అనే వృద్ధురాలి హత్య, భారీ దోపిడీ కేసు దర్యాప్తులో వైఫల్యం చెందడంతో పోలీసుల పని తీరును అందరూ తప్పుబడుతున్నారు. కేసులో ఎటువంటి ప్రగతి లేకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. - మడకశిర
   
మడకశిరలో భారతమ్మ(60) హత్య, దోపిడీ కేసు కుంటుపడిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఘటన జరిగి 80 రోజులు పైబడి కావస్తున్నా ఇంత వరకు చిన్న క్లూ కూడా పోలీసులు సాధించకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో కేవలం అనుమానం పేరుతో కొందరిని పిలిచి విచారణ చేయడం, ఆ తరువాత వారి పాత్ర లేదని తెలుసుకుని వదిలేయడం పరిపాటిగా మారింది.

ఎప్పుడు జరిగిందంటే...
డిసెంబర్ 3న సాయంత్రం 6 గంటలు కావస్తుండగా ఇంట్లో ఒంటరిగా ఉన్న భారతమ్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి, మృతదేహాన్ని ఇంట్లోని మరుగుదొడ్డిలో పడేశారు. ఆ తరువాత భారీగా బంగారు నగలు అపహరించారు. అప్పట్లో ఈ సంఘటన జిల్లాతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోనూ సంచలనం సృష్టించింది.

ప్రత్యేక బృందాలు ఏం చేస్తున్నట్లో..?
హత్య, దోపిడీ అనంతరం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇంకా సీసీఎస్ పోలీసులు కూడా విచారణ చేపటారు. అయితే ఇంత వరకు ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. కనీసం చిన్న క్లూ కూడా సేకరించలేకపోయారంటే పోలీసులు ఎంత నిబద్ధతతో పని చేస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఈ ఉదంతంలో హంతకులను గుర్తించి అరెస్టు చేయడంలో మడకశిర పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కర్ణాటకలోనూ విచారణ
మడకశిర కర్ణాటకకు అత్యంత చేరువలో ఉంది. హంతకులు కర్ణాటకకు పారిపోయి ఉండొచ్చని భావించిన పోలీసులు అక్కడి పోలీసులను అలర్ట్ చేసి, అక్కడా  విచారణ చే శారు. అయినా ఫలితం లేదు.
 మడకశిర సీఐ హరినాథ్ ఏమంటున్నారంటే...   భారతమ్మ కేసులో ఇంత వరకు ఎలాంటి క్లూ దొరకని మాట వాస్తవమే. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసును మేం సవాల్‌గా తీసుకున్నాం. ప్రత్యేక బృందాలు శ్రమిస్తూనే ఉన్నాయి. హంతకులు ఎవరైందీ గుర్తించి పట్టుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement