ఆటో బోల్తా : ఎనిమిది మందికి గాయాలు | Eight injured in road accident in krishna district | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : ఎనిమిది మందికి గాయాలు

Mar 16 2016 10:04 AM | Updated on Sep 26 2018 3:36 PM

కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం వద్ద కూలీలను తీసుకువెళ్తున్న ఆటో బుధవారం బోల్తా పడింది.

విజయవాడ : కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం వద్ద కూలీలను తీసుకువెళ్తున్న ఆటో బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను చందర్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ప్రమాదంపై ఆరా తీశారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement