మద్యం మత్తులో చితకొట్టుకున్న మహిళలు | Drunk Women fight each other on the streets of Rajendra Nagar | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో చితకొట్టుకున్న మహిళలు

Nov 11 2013 12:11 PM | Updated on May 25 2018 2:06 PM

మద్యం మత్తులో చితకొట్టుకున్న మహిళలు - Sakshi

మద్యం మత్తులో చితకొట్టుకున్న మహిళలు

మద్యం తాగారు... రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య నెలకొన్న చిన్న వివాదం కాస్తా రోడ్డుపైనే కొట్టుకునే వరకూ వచ్చింది.

హైదరాబాద్ : మద్యం తాగారు... రోడ్డున పడ్డారు.  ఈ క్రమంలో వారి మధ్య మాటా మాటా పెరిగి అది కాస్తా రోడ్డుపైనే కొట్టుకునే వరకూ వచ్చింది.  అయితే ఇదేదో మగాళ్ల గురించి అనుకుంటే పొరపాటే. కొంతమంది మహిళలు మద్యం మత్తులో కొట్టుకునే వరకూ వెళ్లారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఓ కల్లు కౌంపౌండ్‌లో కొందరు మహిళలు ఫుల్‌గా కల్లు సేవించారు. ఆ సమయంలో పక్కనే వున్న మరికొందరు మహిళలతో గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా... కొట్టుకునే వరకూ వెళ్లింది.

పది మంది చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి... నడిరోడ్డుమీద జుట్టు..జుట్టు పట్టుకుని మరీ చితకొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జనావాసాల మధ్యలో కల్లు దుకాణాలు నిర్వహణపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement