డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నగరంలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సాయి హిమ బిందు (19) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంత్రాలయం మండలం రాంపురం కొట్టాలకు చెందిన శ్రీనివాసరావు కుమార్తె హిమబిందు. అదే కళాశాల హాస్టల్ ఉంటూ చదువుకుంటోంది. ఇటీవల నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో శనివారం రాత్రి స్టడీ అవర్లో లెక్చరర్ అవమాన పరిచినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురై హాస్టల్ గదికి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. స్నేహితులు గుర్తించి కళాశాల నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాస్పత్రి మార్చురీకి తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.