లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ | CI Narasimha murthy while taking bribe in vizianagaram | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

Oct 11 2017 6:19 PM | Updated on Oct 11 2017 6:21 PM

CI Narasimha murthy while taking bribe in vizianagaram

విజయనగరం జిల్లా: విజయనగరం టూటౌన్‌ సీఐగా పనిచేస్తున్న నరసింహ మూర్తి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల కొంత మంది వ్యక్తులు పేకాటాడుతూ పట్టుబడ్డారు. వారిని కేసు నుంచి తప్పించేందుకు నరసింహమూర్తి రూ.50 వేలు లంచంగా అడిగారు.

కాగా, పక్కా సమాచారంతో నిందితుల నుంచి లంచం తీసుకుంటుండగా సీఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement