మురికి కాలువలో చిన్నారి మృతదేహం | child body in drinage canal | Sakshi
Sakshi News home page

మురికి కాలువలో చిన్నారి మృతదేహం

Jul 3 2015 12:25 PM | Updated on Sep 3 2017 4:49 AM

అప్పుడే పుట్టిన పసికందును మురికి కాలువలో వదిలేసి వెళ్లారు.

తూర్పుగోదావరి: అప్పుడే పుట్టిన పసికందును మురికి కాలువలో వదిలేసి వెళ్లారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామంలోని మురికి కాలువలో మగశిశువును గుర్తించిన స్థానికులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement