'చంద్రబాబు ఏదో మ్యాజిక్‌ చేస్తాడనుకోవద్దు' | chandrababu not magic for ap development, says murali mohan | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఏదో మ్యాజిక్‌ చేస్తాడనుకోవద్దు'

Sep 5 2014 6:33 PM | Updated on Sep 2 2017 12:55 PM

'చంద్రబాబు ఏదో మ్యాజిక్‌ చేస్తాడనుకోవద్దు'

'చంద్రబాబు ఏదో మ్యాజిక్‌ చేస్తాడనుకోవద్దు'

వాణిజ్య రాజధాని అయిన విజయవాడను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం మంచి నిర్ణయమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అన్నారు.

హైదరాబాద్: వాణిజ్య రాజధాని అయిన విజయవాడను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం మంచి నిర్ణయమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అన్నారు. చంద్రబాబు ఏదో మ్యాజిక్‌ చేస్తాడని అనుకోకుండా అందరూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని మురళీమోహన్ వ్యాఖ్యానించారు.

సినీ పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌, రాజమండ్రికో తరలిపోవడం అనేది సులభం కాదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ మాదిరిగా వైజాగ్‌లో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement