breaking news
rajahmundry mp
-
సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి?
ఎటూ తేలని టీటీడీ ధర్మకర్తల మండలి భవితవ్యం జీవో ప్రకారం ముగిసిన ఏడాది పదవీ కాలం ప్రమాణస్వీకారం ప్రకారం మే ఒకటి వరకు కొనసాగే అవకాశం పొడిగింపుపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి మార్పులపై సీఎం కసరత్తు, పెరిగిన ఆశావహుల ఒత్తిడి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొనసాగింపుపై సందిగ్ధం వీడడం లేదు. నిబంధనల ప్రకారం గత బుధవారంతోనే టీటీడీ బోర్డు పదవీకాలం ముగిసింది.అయితే ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేస్తుందా..? లేక పాత పాలకమండలినే కొనసాగిస్తుందా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఇదిలా ఉండగా బోర్డులో చోటు దక్కించుకునేందుకు అధికారపార్టీ నాయకులతో పాటు, పారిశ్రామిక వేత్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి నియామక ఉత్తర్వులు గత ఏడాది ఏప్రిల్ 26న వెలువడ్డాయి. టీటీడీ చైర్మన్గా తిరుపతికి చెందిన చదలవాడ కృష్ణమూర్తితోపాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. ఆమేరకు మే 1వ తేదీన చైర్మన్తోపాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది పాటు ధర్మకర్తల మండలి పదవిలో కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ప్రకారం ఈ దర్మకర్తల మండలి పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే ప్రమాణం స్వీకారం చేసింది మే 1న కాబట్టి ఈ ఏడాది మే 1 వరకు వీరు కొనసాగే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తోంది. అందువల్లే జీవో ప్రకారం పదవీ కాలం ముగిసినా ప్రమాణస్వీకారం తేదీని దృష్టిలో ఉంచుకుని చైర్మన్తోపాటు సభ్యులకు అందాల్సిన మర్యాదలన్నీ గురువారం కూడా కొనసాగించారు. సాయన్నతోపాటు పలువురి మార్పులపై కసరత్తు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలినే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్థానిక ఆలయాల కమిటీలకు రెండేళ్లు పొడిగించారు. అదే నిర్ణయానే టీటీడీకి కూడా వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సభ్యుల్లోని తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయన్న ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశాలకు వరుసగా నాలుగుసార్లు హాజరుకాలేదు. ఈయన తొలగింపుపై టీటీడీ, ఎండోమెంట్ చట్టంతోపాటు న్యాయ సలహా తీసుకున్నారు. పనిలో పనిగా ఒకరిద్దరు సభ్యులు మార్పుపై కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి? టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్న సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గురువారం సీఎం చంద్రబాబును కలిసి చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. అలాగే, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు చర్చ సాగుతోంది. ఇక బీజేపీ తరపున నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. తాజా బోర్డు ఉత్తర్వులు ఇంకా రాకపోవడంతో కొత్త బోర్డుపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. గురువారం రాత్రి వరకు దీనిపై ఎటువంటి స్పష్టమైన నిర్ణయం వెలువడ లేదు. పాత బోర్డు కొనసాగింపా? కొత్త బోర్డు నియామకమా? అన్నది శుక్రవారం తేలిపోనుంది. అలా రానిపక్షంలో మే రెండో తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. -
పుష్కరాల కోసం నిధులు విడుదల
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిధులు విడుదల చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ ఎం.మురళీమోహన్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడుతో కలసి మురళీమోహన్ మాట్లాడుతూ... రాజమండ్రిలో మధురపూడి విమానాశ్రయంలో రాత్రిపూట విమానాలు దిగేందుకు అనుమతించాలని పౌర విమానయానశాఖను ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాజమండ్రి - కోవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి మరమ్మతుకు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... బలవంతపు మతమార్పిడులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామని గుర్తు చేశారు. కాని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్నే చేస్తున్నాయని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. -
రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని చూడండి.. ప్లీజ్
పాడైపోతున్న రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని సందర్శించాల్సింగా రైల్వే మంత్రి సదానంద గౌడను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆహ్వానించారు. హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వీటి పునరుద్ధరణకు వెంటనే పనులు చేపట్టాల్సిందిగా కోరానని ఆయన తెలిపారు. హుదూద్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని విశాఖపట్నం పంపాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. అలాగే విద్యుత్ శాఖకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ విషయంలోనూ సాయం చేయాలని తాను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కోరానని మురళీ మోహన్ వెల్లడించారు. -
'చంద్రబాబు ఏదో మ్యాజిక్ చేస్తాడనుకోవద్దు'
హైదరాబాద్: వాణిజ్య రాజధాని అయిన విజయవాడను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం మంచి నిర్ణయమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అన్నారు. చంద్రబాబు ఏదో మ్యాజిక్ చేస్తాడని అనుకోకుండా అందరూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్, రాజమండ్రికో తరలిపోవడం అనేది సులభం కాదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మాదిరిగా వైజాగ్లో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
మురళీమోహన్ క్షమాపణ
-
మహిళలపై మురళీమోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు