
యావజ్జీవ కారాగారశిక్ష రద్దు
ఓ హత్య కేసులో ఇద్దరి నిందితులకు కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
హైకోర్టు తీర్పు
హైదరాబాద్: ఓ హత్య కేసులో ఇద్దరి నిందితులకు కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హత్యకేసులో ప్రమీలా, గజేందర్రెడ్డిలకు చిత్తూరు మొదట అదనపు సెషన్స్ జడ్జి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వారిద్దరూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం, పిటిషనర్లకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారంది. దర్యాప్తు శాస్త్రీయంగా సాగలేదని, ఈ విషయాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదంటూ, కింది కోర్టు తీర్పును రద్దు చేసింది.