అన్నీ ఆధారాలను సిట్‌కు సమర్పించా: మంత్రి | ayyanna patrudu on vishaka land scam | Sakshi
Sakshi News home page

అన్నీ ఆధారాలను సిట్‌కు సమర్పించా: మంత్రి

Jul 14 2017 1:02 PM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖ భూకుంభకోణాలపై ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఎదుట హాజరయ్యారు.

విశాఖపట్నం: విశాఖ భూకుంభకోణాలపై ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఎదుట హాజరయ్యారు. భూ కబ్జాలపై  ఆధారాలను సిట్‌ కు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015 లో భూ ఆక్రమణలపై కలెక్టర్‌ లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. కొంతమంది ప్రభుత్వభూముల నకిలీ డాక్యుమెంట్స్‌ సృష్టించి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారని వివరించారు. సుమారు 1600 ఎకరాల భూముల రికార్డులను ట్యాంపర్‌ చేశారన్నారు.
 
ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే ఇచ్చి నష్టపరిహారం తీసుకున్నారని వెల్లడించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో భారీ మొత్తంలో చెల్లింపులు చేశారన్నారు. మట్టెక్ పార్క్ కోసం ప్రభుత్వ స్ధలాన్నే కాజేసి సొంత భూమని నమ్మించి కోట్ల రూపాయిలను బడాబాబులు కాజేశారని తెలిపారు. ఈ  వ్యవహారాన్ని కూడా సిట్ ముందు వుంచాననని అయ్యన్న చెప్పారు. మెడ్‌ టెక్ వ్యవహారంలో మంత్రి హోదాలో చెల్లింపులు ఆపమని లేఖ రాసినా చెల్లింపులు ఆగలేదన్నారు. మరి కొన్ని ఆధారాలతో ఈ నెల 19న సిట్ అధికారులను కలుస్తానన్నాని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement