హైదరాబాద్‌ చేరుకున్న సీఎం జగన్‌

AP CM YS Jagan Mohan Reddy to Visit US - Sakshi

సాక్షి, గన‍్నవరం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన  గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. రాత్రికి ఆయన ఇక్కడ నుంచే అమెరికా వెళ్లనున్నారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవాసాంధ్రుల కోరిక మేరకు ఆయన ఆగస్ట్‌ 17న ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రసంగించనున్నారు. వారం రోజుల పాటు సీఎం జగన్‌ అమెరికా పర్యటన కొనసాగనుంది. 

చదవండి: బహుదూరపు బాటసారి అమెరికాయానం...

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top