జాతీయ రహదారిపై అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా | Agrigold depositors protests at 5TH number national highway in ongole | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా

Aug 5 2015 1:12 PM | Updated on May 28 2018 3:04 PM

తమకు న్యాయం చేయాలని కోరుతూ.. అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు.

ఒంగోలు : తమకు న్యాయం చేయాలని కోరుతూ.. అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఐదవ నెంబర్  జాతీయ రాహదారిపై అగ్రిగోల్డ్ బాధితులు బుధవారం ధర్నాకు దిగారు. ఇంత మంది బాధితులను మోసం చేసిన యాజమాన్యానికి ప్రభుత్వం కొమ్ముకాస్తుందని బాధితులు ఆరోపించారు.

తమకు నగదు తిరిగి ఇవ్వకుండా .. వారి భూములను స్వాధీనం చేసుకోకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. దీంతో జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి బాధితులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement