నిద్రమత్తులో డ్రైవింగ్: 20 మందికి గాయాలు | 20 injured in a rtc bus accident | Sakshi
Sakshi News home page

నిద్రమత్తులో డ్రైవింగ్: 20 మందికి గాయాలు

Jul 27 2015 8:44 AM | Updated on Sep 29 2018 5:33 PM

డ్రైవర్ నిత్ర మత్తులో ఉండి ఆర్టీసీ బస్సును నడపడంతో 20 మంది తీవ్రంగా గాయపడగా, కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది.

చిత్తూరు(చంద్రగిరి): డ్రైవర్ నిత్ర మత్తులో ఉండి ఆర్టీసీ బస్సును నడపడంతో 20 మంది తీవ్రంగా గాయపడగా, కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పలమనేరు డిపోకు చెందిన బస్సు పలమనేరు నుంచి తిరుపతికి వెళుతుండగా స్వర్ణముఖి నది వద్ద డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వాహనం అదుపు తప్పింది.

దీంతో బస్సు చెట్టును ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. కాగా, కండక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని రియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement